జమ్మూ-కశ్మీర్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి గత మూడేళ్లుగా పాకిస్థాన్ సైనిక రక్షణ సామర్థ్యాన్ని చైనా బలోపేతం చేస్తోంది. ఉక్కు బంకర్లు నిర్మించడంతోపాటు డ్రోన్లనూ పాక్ కు అందిం చిందని భారత్ అధికార వర్గాలు బుధవారం తెలి పాయి. ఎల్వోసీ వెంట గుప్త సంకేతాలను పంపే కమ్యూనికేషన్ టవర్లను, భూగర్భ ఫైబర్ కేబుల్స్ ను చైనా నిర్మించింది. ఎక్కువ ఎత్తు నుంచి, తక్కువ ఎత్తు నుంచి దూసుకొచ్చే శత్రు విమానాలు, డ్రోన్లను ముందే పసిగట్టే అధునాతన చైనీస్ రాడార్ వ్యవస్థలనూ ఏర్పా టుచేశారు. ఇంకా సరిహద్దులో పలు చోట్ల ట్రక్కుల మీద అమర్చిన చైనీస్ హోవిట్జర్ ఫిరంగులు తిరు గుతూ కనిపించాయి. ఎల్వోసీ వెంబడి భూగర్భ బంకర్లు, ఇతర రక్షణ వ్యవస్థలను నిర్మించే పనిలో చైనా ఇంజనీర్లు నిమగ్నమై ఉన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని లీపా లోయలో చైనీయులు సొరంగ నిర్మాణం చేపట్టారు. కారకోరం రహదారికి అన్ని రుతువుల్లో రాక పోకలు సాగించడానికి అనువైన రోడ్డును వారు నిర్మి స్తున్నట్లు భారతీయ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. చైనాలోని షింజియాంగ్ రాష్ట్రం నుంచి కారకోరం రహ దారి ద్వారా పాక్ లోని గ్వాదర్ రేవు వరకు చైనా-పాక్ ఆర్థిక నడవా ప్రాజెక్టు (సీపెక్) నిర్మాణంపై చైనా 4,600 కోట్ల డాలర్లు వెచ్చిస్తోంది. ఈ పెట్టుబడులను కాపాడు కోవడానికే పాక్ రక్షణ సామర్థ్యాన్ని చైనా పటిష్ఠం చేస్తోంది. భారత నిఘా సంస్థలు ఈ వ్యవహారాలను నిశితంగా గమనిస్తున్నాయి.
61
You Might Also Like
‘కంబోడియా’ ఉచ్చు నుంచి 60 మంది భారతీయులకు విముక్తి
34
కంబోడియాలో స్కాం కార్యకలాపాల్లో చిక్కుకున్న 60 మంది భారతీయులకు విముక్తి లభించింది. వేరే ఉద్యోగాల కోసం వెళ్లి ఏజెంట్ల చేతికి చిక్కిన వీరిని మే 20న కంబోడియాలోని...
రేపటి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
34
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి 12వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు టిటిడి కార్యనిర్వహణాధికారి జె.శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో...
విజయవాడలో నేటి నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు
29
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల మూడు నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కానున్నాయి. ఈ సందర్భంగా నగరంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు...
ఆలయాల జీర్ణోద్ధరణకు కృషి
41
ఆలయాల జీర్ణోర్ధరణకు అన్ని విధాల కృషి చేస్తామని వైయస్సార్, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల దేవదాయ శాఖ అధికారి సి.విశ్వనాథ్ అన్నారు.అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని హసనాపురం గ్రామంలో...
అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు
42
దేశవ్యాప్తంగా దసరా నవరాత్రుల ఉత్సాహం నెలకొంది. యూపీలోని అయోధ్యలోనూ దసరా వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ శరన్నవరాత్రులలో రామ్లల్లా దర్శన, మంగళ హారతుల సమయాల్లో మార్పులు...
‘మోమిడి’కి జాతీయ ఉత్తమ అవార్డు
44
చిత్తూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి పంచాయతీకి జాతీయస్థాయి ఉత్తమ అవార్డు లభించింది. స్వచ్ఛ భారత్లో భాగంగా ‘పేదరికం లేని జీవనోపాధి మెరుగ్గా ఉన్న పంచాయతీ, ఆరోగ్యకరమైన,...