News

ఎల్వోసీ వెంబడి చైనా రక్షణ నిర్మాణాలు

61views

జమ్మూ-కశ్మీర్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి గత మూడేళ్లుగా పాకిస్థాన్ సైనిక రక్షణ సామర్థ్యాన్ని చైనా బలోపేతం చేస్తోంది. ఉక్కు బంకర్లు నిర్మించడంతోపాటు డ్రోన్లనూ పాక్ కు అందిం చిందని భారత్ అధికార వర్గాలు బుధవారం తెలి పాయి. ఎల్వోసీ వెంట గుప్త సంకేతాలను పంపే కమ్యూనికేషన్ టవర్లను, భూగర్భ ఫైబర్ కేబుల్స్ ను చైనా నిర్మించింది. ఎక్కువ ఎత్తు నుంచి, తక్కువ ఎత్తు నుంచి దూసుకొచ్చే శత్రు విమానాలు, డ్రోన్లను ముందే పసిగట్టే అధునాతన చైనీస్ రాడార్ వ్యవస్థలనూ ఏర్పా టుచేశారు. ఇంకా సరిహద్దులో పలు చోట్ల ట్రక్కుల మీద అమర్చిన చైనీస్ హోవిట్జర్ ఫిరంగులు తిరు గుతూ కనిపించాయి. ఎల్వోసీ వెంబడి భూగర్భ బంకర్లు, ఇతర రక్షణ వ్యవస్థలను నిర్మించే పనిలో చైనా ఇంజనీర్లు నిమగ్నమై ఉన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని లీపా లోయలో చైనీయులు సొరంగ నిర్మాణం చేపట్టారు. కారకోరం రహదారికి అన్ని రుతువుల్లో రాక పోకలు సాగించడానికి అనువైన రోడ్డును వారు నిర్మి స్తున్నట్లు భారతీయ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. చైనాలోని షింజియాంగ్ రాష్ట్రం నుంచి కారకోరం రహ దారి ద్వారా పాక్ లోని గ్వాదర్ రేవు వరకు చైనా-పాక్ ఆర్థిక నడవా ప్రాజెక్టు (సీపెక్) నిర్మాణంపై చైనా 4,600 కోట్ల డాలర్లు వెచ్చిస్తోంది. ఈ పెట్టుబడులను కాపాడు కోవడానికే పాక్ రక్షణ సామర్థ్యాన్ని చైనా పటిష్ఠం చేస్తోంది. భారత నిఘా సంస్థలు ఈ వ్యవహారాలను నిశితంగా గమనిస్తున్నాయి.