News

బద్రీనాథ్ దర్శనం లేకుండానే.. 650 మందికి పైగా భక్తులు వెనక్కి

93views

పేర్లు నమోదు చేసుకోకుండా చార్ థామ్ యాత్రకు వెళ్లిన భక్తులను దర్శనానికి అనుమతించకుండా అధికారులు వెనక్కు పంపించారు. తప్పనిసరి రిజిస్ట్రేషన్ నిబంధనను పాటించకుండా 650 మందికి పైగా భక్తులు బద్రీనాథ్ వెళుతుండగా.. గౌచార్ చెకోపోస్ట్ నుంచే వారిని వెనక్కు పంపించినట్లు చమోలీ ఎస్ఎస్ పీ కార్యాలయం మంగళవారం తెలిపింది. యాత్ర ప్రారంభ రోజుల్లో నెలకొన్న గందర గోళం దృష్ట్యా రద్దీని నియంత్రించడానికి చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
యాత్రికులను తీసుకొచ్చిన దాదాపు 120 వాహనాలను కూడా తిప్పి పంపించామని, అయిదు వాహనాల నిర్వాహకులపై చర్యలుసైతం తీసుకున్నామని వెల్లడించారు. పేర్లు నమోదు చేసుకోకుండా యాత్రకు రావొద్దని, రిజిస్ట్రేషన్లో తమకు కేటాయించిన తేదీల్లో మాత్రమే భక్తులు రావాలని ఉత్తరాఖండ్ సీఎస్, డీజీపీ విజ్ఞప్తి చేశారు.