News

సెయింట్ లూయిస్‌లో శ్రీనివాస కళ్యాణం.. తరలివచ్చిన భక్తజన సందోహం

67views

సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో తొలిసారిగా నిర్వహిస్తున్న 2024 వార్షిక బ్రహ్మోత్సవంలో నాలుగో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం హోమం నిర్వహించారు. అనంతరం సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు ఊరేగింపుగా శోభిల్లాడు. NRI భక్తులు పారవశ్యంతో దేవదేవుని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సాయంత్రం స్థానిక సాంస్కృతిక కేంద్రంలో శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు వేల సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆలయ ఛైర్మన్ గంగవరపు రజనీకాంత్, ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయ్ సాక్షి, బ్రహ్మోత్సవాల కమిటీ కార్యదర్శి పుట్టగుంట మురళీలు ఏర్పాట్లను సమీక్షించారు. మంగళవారం నాడు పుష్పయాగంతో అయిదురోజుల క్రతువు ముగిసిందని మీడియా కమిటీ ఛైర్మన్ సూరపనేని రాజా పేర్కొన్నారు.