రాజమహేంద్రవరంలోని హితకారిణి సమాజం ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం 105వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్.కె.వి.టి డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ రాజబాబు, తెలుగు విభాగాధిపతి డా. పి.వి.బి సంజీవ రావు తదితర నగర ప్రముఖులు రాజమహేంద్రవరం ఆనంద గార్డెన్స్ వద్ద కందుకూరి దంపతుల సమాధుల వద్ద పుష్పాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే రౌతు మాట్లాడుతూ తెలుగు సమాజం యొక్క సామాజిక పునరుజ్జీవనం, వితంతు పునర్వివాహాలు, స్త్రీ విద్య, బాల్య వివాహాల నిర్మూలనలో కందుకూరి వీరేశలింగం కీలక పాత్ర పోషించారన్నారు. ప్రగతిశీల విలువలను పెంపొందించడానికి నవలలు, వ్యాసాలు మరియు నాటకాలతో తెలుగు సాహిత్యానికి గణనీయమైన కృషి చేశారని తెలిపారు. హితకారిణి సమాజం సహాయ కమిషనర్ మరియు కరస్పాండెంట్ సింగం రాధా మాట్లాడుతూ ఆయన స్థాపించిన హితకారిణి సమాజం కందుకూరి వారసత్వాన్ని కొనసాగిస్తూ సామాజిక సంస్కరణ, లింగ సమానత్వం మరియు మహిళా సాధికారతకు కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు .
249views
You Might Also Like
అయోధ్య శేషావతార ఆలయ ధ్వజారోహణం..
10
అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శేషావతార ఆలయ ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 11 మంది సాధు సంతులు హాజరయ్యారు. వీరి...
వృద్ధులకు సేవ చేయడం పవిత్రమైన బాధ్యత : భయ్యాజీ జోషి
40
కుటుంబాల్లో వున్న వృద్ధులకు సేవ చేయడం అనేది కేవలం సేవ కాదని, అదో పవిత్రమైన బాధ్యత అని ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు భయ్యాజీ జోషి...
బెంగళూరు వేదికగా ‘‘ విద్యా భారతి’’ అఖిల భారతీయ సమావేశాలు
31
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లింక్ ఇంటర్నేషనల్ సెంటర్ లో విద్య భారతి అఖిల భారతీయ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి...
కనిష్కను కూల్చింది ఖలిస్థానీ ఉగ్రవాదులే : 41 ఏళ్ల తర్వాత అంగీకరించిన కెనడా
34
ఖలిస్థానీ ఉగ్రవాదంపై మెతక వైఖరి అవలంబిస్తూ.. వారికి పరోక్షంగా మద్దతిస్తూ, ఆశ్రయమిస్తూ వచ్చిన కెనడా తన వైఖరిని మార్చుకుంటోందా..? అవుననే సమాధానం వస్తోంది. ఎయిరిండియా కనిష్క విమాన...
తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం..
35
తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ ప్రతిష్ఠాత్మక మ్యూజియం కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించేందుకు...
విజయనగరంలో వైభవంగా పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం
42
విజయనగర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో కీలక ఘట్టమైన శిఖర ప్రతిష్ఠ మహోత్సవం గురువారం ఉదయం వేదమంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా...





