News

వైభవంగా ముగిసిన తిరుపతి గంగమ్మ జాతర

98views

వారం రోజులుగా వైభవంగా జరుగుతున్న తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర మంగళవారంతో ముగిసింది . ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన జాతరలో భక్తులు రోజుకో వేషం వేసుకుని వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ పౌరాణిక, జానపద వేషాలు వేసుకొని డప్పుల దరువుల నడుమ చిందులు వేస్తూ అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నా­రు. తా­తయ్యగుంట గంగమ్మ ఆలయంలో . జాతరలో మహోత్సవంలో ముఖ్యమైన, ఆఖరి ఘట్టమైన విశ్వరూప ప్రతిమను కొలువు తీర్చడంతో గత అర్ధరాత్రి అమ్మ వారు విశ్వరూప దర్శమిచ్చారు.భక్తులు భారీగా తరలివచ్చిన అమ్మవా రిని దర్శించుకున్నారు.అమ్మవారి చెంప నరికి శాంతింప చేసి, అమ్మవారి ప్రతిమ నుండి మట్టి తీసి భక్తులపై విసురారు.ఆ మట్టి కోసం భక్తులు ఎగబడి మట్టి అందుకున్నారు. పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య విశ్వరూప దర్శనం ముగిసింది.