విజయవాడ మాచవరం దాసాంజనేయస్వామివారి దేవాలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు హను మజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి నాగినేని భవాని తెలిపారు. స్థానిక దాసాంజనేయస్వామివారి దేవాలయంలో హనుమజ్జయంతి వేడుకల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 30వ తేదీ గురు వారం సాయంత్రం 6 గంటలకు శ్రీ విష్వక్సేన పూజ అంకురార్పణతో వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. స్వామివారికి విశేషంగా మన్యసూక్త పారాయణం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని చెప్పారు. 31వ తేదీ శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నిత్యారాధన, పంచామృత స్నపనం, నాగవల్లీదళ సహస్ర నామార్చనలు ఆలయ అర్చకులచే శాస్త్రోక్తంగా జరుగుతాయన్నారు. వచ్చే నెల 1వ తేదీ శనివారం హనుమజ్జయంతిని పురస్క రించుకుని స్వామివారికి ప్రీతికరమైన సిందూర అర్చన, తమలపాకులతో అర్చన, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామన్నారు.
102
You Might Also Like
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...
ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్
16
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు,...
చంద్రుడిపై రయ్ రయ్మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..
30
చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం...
అవన్నీ మా ఆస్తులే.. వక్ఫ్ మాటలకు ముక్కున వేలేసుకుంటున్న జనాలు
21
ఢిల్లీ వక్ఫ్ బోర్డు పలు ఆస్తులు తమవేనంటూ కొత్త రాగం అందుకుంది. దీంతో ఈ ఘటన వివాదానికి దారితీసింది. డీటీసీ బస్టాండ్, డీడీఏ కార్యాలయం, ఫోర్ లైన్...
సెక్యులరిజం యూరోపియన్ భావన.. భారత్లో అవసరం లేదు: తమిళనాడు గవర్నర్
27
సెక్యులరిజం అన్నది యూరోపియన్ భావన అని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. భారతీయులకు ఇది అవసరం లేదని అన్నారు. లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు మోసం...
ఆ ఆలయంలో ప్రసాదాలపై నిషేధం
27
తిరుపతి శ్రీవారి లడ్డూ చుట్టూ ప్రస్తుత వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీలోని మంకామేశ్వర్ ఆలయం కీలక నిర్ణయం తీసుకున్నది. భక్తులు బయటి నుంచి...