News

చార్‌ధామ్ యాత్ర: భక్తులకు అలెర్ట్.. మే 31 వరకు నిలుపుదల

106views

హిందువులు ఎంతగానో ఎదురుచూసే చార్ ధామ్ కేదార్నాథ్ ఆలయ తలుపు తెరచుకోవడంతో ప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ యాత్రకు దేశ నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఊహించిన దానికంటే యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు యాత్రకు పోటెత్తుతున్నారు. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మే 31 వరకు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం నిషేధించింది. నాలుగు ధామ్‌లలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ మే 31 వరకు మూసివేయనున్నామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పష్టం చేశారు. దీంతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న యాత్రికులు మాత్రమే ప్రస్తుతం యాత్రకు వెళ్లగలరు. ఇటువంటి పరిస్థితిలో ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం వేచి ఉన్న భక్తులు తమ రిజిస్ట్రేషన్ కోసం తదుపరి ప్రభుత్వ ఉత్తర్వుల వరకు వేచి ఉండవలసి ఉంటుంది.

మరో పదిరోజుల పాటు రిజిస్ట్రేషన్ కోసం వేచి చూడాలి. డెహ్రాడూన్, హరిద్వార్ జిల్లాల్లో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ క్యాంపులను ఏర్పాటు చేసింది. నిత్యం భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. యాత్రకు వెళ్ళడానికి రిజిస్ట్రేషన్ కోసం ఎంత సమయం అయినా ఈ శిబిరాల్లో వేచి చూస్తున్నారు. మే 19న మళ్లీ ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామని గతంలో చెప్పగా.. ఇప్పుడు మే 31 వరకు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో ఇక్కడికి వచ్చిన భక్తులకు నిరాశే ఎదురైంది. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మరో పదిరోజుల పాటు రిజిస్ట్రేషన్ కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.