News

శ్రీలంక ఆలయంలో సరయు నదీ జలాలతో కుంభాభిషేకం…తిరుపతి నుంచి ప్రసాదం

63views

శ్రీలంకలోని సీతా అమ్మన్ ఆలయానికి ఆదివారం నిర్వహించిన కుంభాభిషేకం కార్యక్రమంలో శ్రీలంక, భారత్, నేపాల్ కు చెందిన వేల మంది భక్తులు పాల్గొన్నట్లు భారత హైకమిషన్ ‘ఎక్స్’ వేదికగా తెలి పింది. సీతా ఎలియా అనే గ్రామంలో జరిగిన ఈ వేడుకలో అయోధ్య నుంచి ప్రవహించే పవిత్రమైన సరయు నది జలాలను ఉపయోగించారు. ఈ కార్యక్రమానికి శ్రీలంకలో భారత హైకమిషనర్ సంతోష్ ఝా, ఆధ్మా త్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ హాజరయ్యారు. భారత్, నేపాల్ దేశాలు అందించిన వస్త్రాలతో పాటు, తిరుపతి నుంచి పంపించిన ప్రసాదాలను సీతా దేవికి సమర్పించడంతో ఈ కార్యక్రమం ముగిసింది.