రాయదుర్గంలో ప్రతి ఏటా బాలికతో ప్రసన్న వేంకటరమణుడి కల్యాణోత్సవాన్ని జరపటం అరవా తెగకు ఆనవాయితీగా వస్తోంది. పట్టణంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో పురప్రముఖులు, దేవాదాయశాఖ అధికారులు, భక్తుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పట్టణానికి చెందిన రమేష్, జయమ్మల కుమార్తె మౌనిక(10)తో శ్రీవారి నిశ్చితార్థం చేశారు. ఈనెల 25న ఉదయం 11గంటలకు పట్టణంలోని స్వామివారి ఆలయంలో ప్రజల సమక్షంలో శ్రీదేవి, భూదేవిలతో పాటు బాలికతోనూ వేంకటేశ్వరుడి ఉత్సవ విగ్రహంతో కల్యాణం చేయనున్నారు. స్వామివారి తరఫున ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలాక్షిరెడ్డి, దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మేళతాళాలతో ఊరేగింపుగా కుమార్తె ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అలంకరించిన మౌనికను తల్లిదండ్రులు, బంధువులతో ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకువచ్చి, అర్చకులు బాలికతో వేంకటరమణుడి(కలశం)తో నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్ళారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు శివప్ప, కార్యదర్శి నాగప్ప, ఆసంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
258views
You Might Also Like
అలా చేస్తే చరిత్రలో కలిసిపోతారు.. పాక్కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్!
8
పాకిస్థాన్కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగిస్తే, భవిష్యత్తులో భౌగోళిక...
రూ.182 కోట్ల ‘జిహాదీ డ్రగ్’ పట్టివేత
10
మాదక ద్రవ్యాల రవాణాపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. దేశం మీదుగా పశ్చిమాసియాకు భారీ మొత్తంలో డ్రగ్స్ తరలిపోకుండా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అడ్డుకుంది. ఈ క్రమంలో...
భారతీయత – హిందూ కుటుంబ భావన
విశ్వమంతా ఒకే కుటుంబం అనే ఉదాత్తమైన భావనను లోకానికి చాటిన పుణ్యభూమి భారతదేశం. ప్రస్తుత ఆధునిక కాలంలో అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం జరుపుకోవడం వెనుక మానవ సంబంధాలను...
ఆలయాల్లో శఠగోపం.. అంతరార్థం
12
దేవాలయాల్లో దైవ దర్శనం అనంతరం పూజారి భక్తుల తలపై ఉంచే లోహ కిరీటం వంటి పరికరాన్ని శఠగోపం లేదా శఠారి అంటారు. దీనిపై భగవంతుడి పాద ముద్రలు...
జీవన సమతుల్యతకు మూలస్తంభం తృప్తి
జీవన సమతుల్యతకు మూలస్తంభం తృప్తి. అదొక స్థిరమైన భావం కాదు; సమయం, అవసరం, కోరికలు- ఇవి మారుతున్న కొద్దీ తృప్తి రూపం కూడా మారుతూ ఉంటుంది. ఆకలిగా...
హరిత మంత్రాలయంగా తీర్చిదిద్దుదాం : పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థుల పిలుపు
30
సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో మంత్రాలయాన్ని హరితవనంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రం డీజీవీ అతిథి గృహం సమీపంలోని హైవే రోడ్డులో డివైడర్ మధ్య నాటిన మొక్కలకు...





