రాయదుర్గంలో ప్రతి ఏటా బాలికతో ప్రసన్న వేంకటరమణుడి కల్యాణోత్సవాన్ని జరపటం అరవా తెగకు ఆనవాయితీగా వస్తోంది. పట్టణంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో పురప్రముఖులు, దేవాదాయశాఖ అధికారులు, భక్తుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పట్టణానికి చెందిన రమేష్, జయమ్మల కుమార్తె మౌనిక(10)తో శ్రీవారి నిశ్చితార్థం చేశారు. ఈనెల 25న ఉదయం 11గంటలకు పట్టణంలోని స్వామివారి ఆలయంలో ప్రజల సమక్షంలో శ్రీదేవి, భూదేవిలతో పాటు బాలికతోనూ వేంకటేశ్వరుడి ఉత్సవ విగ్రహంతో కల్యాణం చేయనున్నారు. స్వామివారి తరఫున ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలాక్షిరెడ్డి, దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మేళతాళాలతో ఊరేగింపుగా కుమార్తె ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అలంకరించిన మౌనికను తల్లిదండ్రులు, బంధువులతో ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకువచ్చి, అర్చకులు బాలికతో వేంకటరమణుడి(కలశం)తో నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్ళారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు శివప్ప, కార్యదర్శి నాగప్ప, ఆసంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
270views
You Might Also Like
రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన
29
రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన నేడు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ...
అయోధ్య భగవతి మందిరంలో ఘనంగా ధ్వజారోహణ
31
అయోధ్యలోని భవ్య రామమందిర ప్రాంగణంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కాంప్లెక్స్ ఉత్తర-పశ్చిమ (పర్కోటా) దిశలో నూతనంగా నిర్మించిన మాతా భగవతి ఆలయ శిఖరంపై ఘనంగా ధ్వజారోహణ...
భారతీయ సంస్కృతి ఒక సద్గుణ ప్రవాహం : శాంతక్క
41
గుజరాత్లోని కర్ణావతిలో న రాష్ట్రీయ సేవికా సమితి గుజరాత్ ప్రాంత శిక్షణా శిబిర ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రీయ సేవికా సమితి ప్రముఖ సంచాలిక...
విత్తన బంతులతో అటవీ ప్రాంతాల్లో వనాల పెంపు
28
పచ్చదనం విస్తరణలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అటవీ డివిజన్లో విత్తన బంతులతో వనాల పెంపునకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని డీఎఫ్ఓ వై.వి.నరసింహరావు అన్నారు. చింతపల్లి...
90 ఏళ్ల అత్తగారిని తలపై మోస్తూ యాత్రలు చేస్తున్న కోడలు
32
హర్యానాకు చెందిన ప్రముఖ గాయని కాజల్ చౌదరి తన 90 ఏళ్ల అత్తగారి చిరకాల కోరికను నెరవేర్చేందుకు చేసిన విశేష సేవ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల...
రక్షణ రంగంలో మరో మైలురాయి.. రుద్ర క్షిపణి పరీక్ష విజయవంతం
36
భారత రక్షణ రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎయిర్-టు-సర్ఫేస్ లక్ష్యాలను ఛేదించే రుద్ర ఎం-2 (RudramM-2) క్షిపణి పరీక్షను రక్షణ...





