రాయదుర్గంలో ప్రతి ఏటా బాలికతో ప్రసన్న వేంకటరమణుడి కల్యాణోత్సవాన్ని జరపటం అరవా తెగకు ఆనవాయితీగా వస్తోంది. పట్టణంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో పురప్రముఖులు, దేవాదాయశాఖ అధికారులు, భక్తుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పట్టణానికి చెందిన రమేష్, జయమ్మల కుమార్తె మౌనిక(10)తో శ్రీవారి నిశ్చితార్థం చేశారు. ఈనెల 25న ఉదయం 11గంటలకు పట్టణంలోని స్వామివారి ఆలయంలో ప్రజల సమక్షంలో శ్రీదేవి, భూదేవిలతో పాటు బాలికతోనూ వేంకటేశ్వరుడి ఉత్సవ విగ్రహంతో కల్యాణం చేయనున్నారు. స్వామివారి తరఫున ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలాక్షిరెడ్డి, దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మేళతాళాలతో ఊరేగింపుగా కుమార్తె ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అలంకరించిన మౌనికను తల్లిదండ్రులు, బంధువులతో ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకువచ్చి, అర్చకులు బాలికతో వేంకటరమణుడి(కలశం)తో నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్ళారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు శివప్ప, కార్యదర్శి నాగప్ప, ఆసంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
327views
You Might Also Like
ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. యూపీ విద్యార్థిని పిటిషన్ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు..
3
పాఠశాల యూనిఫామ్తో పాటు హిజాబ్ లేదా తలపై స్కార్ఫ్ ధరించేందుకు అనుమతించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది....
భూమిపై తొలి జీవం భారత్లోనే పుట్టిందా?
34
భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన అత్యంత ప్రాచీన ఆధారాలను భారతీయ భూగర్భ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. జార్ఖండ్లోని సింగ్భూమ్ క్రేటన్ శిలల్లో సుమారు 350 కోట్ల (3.5...
పాకిస్తాన్ కుట్రల బారిన పడకుండా గురుద్వారాల ద్వారా ISI ప్రమాదాలపై అవగాహన
31
పాకిస్తాన్ తన దుష్టచర్యలను మానడం లేదు. పంజాబ్లో ఉగ్రవాదాన్ని, యువతను మత్తుపదార్థాలకు బానిసలుగా చేసే కుట్రలు చేస్తోంది. దీనిని తిప్పికొట్టడానికి పంజాబ్లోని సిక్కు సమాజం పాకిస్తాన్పై పోరాటం...
స్వామి లక్ష్మణానంద శత జయంతి వేడుకలు ప్రారంభం
17
భువనేశ్వర్ : మత ఛాందసుల చేతిలో ఘోరంగా హత్యకు గురైన స్వామి లక్ష్మణానంద శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆయన జన్మస్థలమైన గురుజంగ్ కేంద్రంగా ఇవి ప్రారంభమయ్యాయి....
పాక్ సైన్యంపై సొంత దేశంలోనే విమర్శలు.. 1971 ఓటమిని గుర్తుచేసిన ఫజ్లుర్ రెహమాన్
41
పాకిస్థాన్ సైన్యానికి సొంత దేశంలోనే విమర్శలు ఎదురవుతున్నాయి. భారత్ను ఉద్దేశించి అప్పటి పాక్ సైన్యాధ్యక్షుడు యాహ్యా ఖాన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ జమైత్ ఉలేమా-ఇ-ఇస్లాం (ఎఫ్) అధినేత...
లవ్ జీహద్ బాధితురాలు.. ఇస్లాం మతోన్మాదానికి బలైన సౌజన్య రాసిన సూసైడ్ లెటర్..
43
రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ పిఠాపురం ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన సూసైడ్ లెటర్ వెలుగులోకి వచ్చింది. ‘సాధిక్’ అనే వ్యక్తి తమ...





