News

టిటిడి వేద విశ్వవిద్యాలయంతో కేంద్ర విద్యా శాఖ ఒప్పందం

273views

భారతీయ నాలెడ్జ్ సిస్టమ్స్ (ఐకెఎస్)పై కంటెంట్‌ను రూపొందించడం మరియు అభివృద్ధి చేయడం లక్ష్యంగా టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం (ఎస్‌వివియు)తో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై సంతకం చేసింది.

సాంప్రదాయ స్వరాలను డిజిటల్‌గా సంరక్షించడానికి, వేద మంత్రోచ్ఛారణలు మరియు వివిధ ఆచారాల ఆడియో-విజువల్ రికార్డులను రూపొందించడంతో పాటు, భారతీయ నాలెడ్జ్ సిస్టమ్స్ వేద మూలాలపై సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు, సమావేశాలు మరియు ‘శాస్త్రార్థ గోష్టి’లను ఈ ఒప్పందం మరింత సులభతరం చేస్తుందని అధికారులు చెప్పారు.