
342views
మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్పై మణిపూర్లో విధించిన నిషేధాన్ని ఈ నెల 8 వరకు పొడిగించారు. మణిపూర్ రైఫిల్స్ శిబిరంపై ఇటీవల జరిగిన దాడి తర్వాత ఈ నిషేధాన్ని విధించారు. విద్వేషాన్ని ఎగదోసే సందేశాలు, ఛాయాచిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేసేందుకు సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నించవచ్చనే ఉద్దేశంతో దీనిని పొడిగించాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబరులో కొన్నిరోజులు మినహా మే 3 నుంచి ఎప్పటికప్పుడు నిషేధాన్ని పొడిగిస్తూ వస్తున్నారు.





