
భారతీయ ముస్లింలపై ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు సీఎం యోగి ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. భారతదేశంలో ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే వారు తమ ఆధిపత్యం యొక్క బూటకపు వాక్చాతుర్యాన్ని విడిచిపెట్టాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇటీవల చేసిన ప్రకటనపై యోగీని అడిగారు. ఆ ప్రకటనతో తాను ఏకీభవిస్తున్నట్లు యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కేవలం పాలన ద్వారా మాత్రమే కమ్యూనిటీలను చేరుకోగలవని, సంక్షేమ పథకాలను ప్లాన్ చేసేటప్పుడు తమ ప్రభుత్వం లబ్ధిదారుల వర్గాలను “ఎంచుకోవడం మరియు ఎన్నుకోవడం” అనే పద్దతిని అవలంభించదని అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు, మెరుగైన పాలన అన్ని వర్గాలకు సహాయపడిందన్నారు. అన్ని మతాల పండుగలను శాంతియుతంగా నిర్వహించబడుతున్నాయన్నారు. హిందూ బాలికలు సురక్షితంగా ఉంటే, ముస్లిం బాలికలు కూడా సురక్షితంగా ఉన్నారన్నారు. తమ ప్రభుత్వ పథకాలన్నీ ముస్లింలతో సహా ప్రతి వ్యక్తికి ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. తాము ఎలాంటి బుజ్జగింపు రాజకీయాలు చేయమని సృష్టం చేశారు.





