News

అయోధ్యకు చేరిన సాలగ్రామ శిలలు.. త్వరలోనే రాముడి విగ్రహం రెడీ!

270views

ఉత్తరప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న అయోధ్య రామ మందిరం వద్దకు నేపాల్ ప్రభుత్వం అందజేసిన సాలగ్రామ శిలలను తీసుకొచ్చారు. లారీలలో ఆ శిలలను తీసుకొస్తున్న సమయంలో భక్తులు భారీగా తరలివచ్చి దారివెంట బాణసంచా కాల్చుతూ ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు. దీంతో జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య వీధులు మార్మోగాయి. 60 మిలియన్ల వయసున్న ఈ శిలలతోనే రాముడి విగ్రహాన్ని తయారు చేయనున్నారు.