News

సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు సృష్టిస్తోంది

401views

న్యూఢిల్లీ: భారతదేశం సౌర, అంతరిక్ష రంగాలు “అద్భుతాలు చేస్తున్నాయని” ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. వాటి విజయాలను చూసి ప్రపంచం మొత్తం “ఆశ్చర్యపోతోంది” అని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ తన నెలవారీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసారంలో, ఒకేసారి 36 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టడం అన్నది మన యువత దేశానికి ఇచ్చిన “ప్రత్యేక దీపావళి బహుమతి”గా అభివర్ణించారు.

క్రయోజెనిక్ రాకెట్ టెక్నాలజీని మన దేశానికి ఇచ్చేందుకు ఇతర దేశాలు గతంలో తిరస్కరించాయని, ఆ తర్వాత భారతీయ శాస్త్రవేత్తలు మన దేశంలోనే అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివ‌ృద్ధి చేశారని ప్రధాని గుర్తు చేశారురు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ డజన్లకొద్దీ ఉపగ్రహాలను రోదసిలోకి పంపిస్తోందని చెప్పారు.

ఇస్రో పదేళ్ళ క్రితం జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (జి ఎస్ ఎల్ వి) ప్రాజెక్టును విజయవంతం చేసింది. క్రయోజెనిక్ ఇంజిన్‌తో జీఎస్ఎల్‌వీ-డీ5ను విజయవంతంగా ప్రయోగించింది. అంతకుముందు దశాబ్దాలపాటు మన దేశంపై అమెరికా, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ ఆంక్షలు అమలవుతూ ఉండేవి.

తాజాగా దీపావళికి ముందు 36 కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ను విజయవంతంగా కక్ష్యలలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. మరో 36 బ్రాడ్‌బ్యాండ్ ఉపగ్రహాలను త్వరలోనే ప్రయోగించబోతోంది. ఇస్రో ఇటీవల విజయవంతంగా ఉపగ్రహాలను పంపించడంతో అంతర్జాతీయ వాణిజ్య విపణిలో భారత దేశం బలమైన పోటీదారుగా నిలిచిందని ప్రధాని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి