News

కశ్మీర్​లో ఇద్దరు యూపీ కూలీల హత్యకు కారకుడైన హైబ్రిడ్​ ఉగ్రవాది హతం

509views

కశ్మీర్: జమ్ముకశ్మీర్​లోని షోపియాన్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో అరెస్ట్​ అయిన లష్కరే తోయిబా ‘హైబ్రిడ్ ఉగ్రవాది’ ఇమ్రాన్​ బషీర్ మరో ముష్కరుడి చేతిలో హతమైనట్టు పోలీసులు తెలిపారు. ఇమ్రాన్​ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు.. మరో ముష్కరుడి కోసం బుధవారం ఉదయం సోదాలు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ ఉగ్రవాది తమపైకి ఒక్కసారిగా కాల్పులు జరిపాడని, అప్పుడు హైబ్రిడ్​ ఉగ్రవాది​ చనిపోయాడని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి