
489views
బిక్కవోలు: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గోలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని శివలింగం అపవిత్రం అయింది. శనివారం వైఎస్ఆర్ చేయూత పంపిణి కార్యక్రమంలో భాగంగా బిక్కవోలు గోలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణ బయట టెంట్ వేశారు. అయితే, టెంట్ తాళ్లను ఆలయ ప్రాంగణంలో ఉన్న శివలింగం పానుమట్టుకు కట్టారు. ఈ ఘటనను భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్టు స్థానిక ఎస్సై బుజ్జిబాబు ఓ ప్రకటనలో తెలిపారు.
Source: EtvBharat





