
384views
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లను బ్రాండ్ ఇండియాకు అంబాసిడర్లుగా ఉండాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి శాఖల మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అమెరికాలోని ఆరు ప్రాంతాల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)ని ప్రారంభించిన అనంతరం శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.
ఐసీఏఐ ఆఫీస్ బేరర్లు తమ వృత్తిని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు చేస్తున్న కృషికి మంత్రి అభినందనలు తెలిపారు. రాబోయే 25 ఏళ్ళు భారతదేశం ఒక శక్తిగా ఎదగడానికి, భౌగోళిక రాజకీయ రంగంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సాధించడానికి చాలా కీలకమైన సమయం అని ఆయన తెలిపారు. భారతదేశం చేస్తున్న ఈ ప్రయాణంలో ఐసిఏఐ కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Source: Nijamtoday





