
భాగ్యనగరం: హుస్సేన్ సాగర్లో మట్టి గణపతి విగ్రహాలనే మాత్రమే నిమజ్జనం చేయాలంటూ ప్రభుత్వం సూచనపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వ్యతిరేకించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కూడా నిమజ్జనం చేసేందుకు అనుమతించాల్సిందేనని పట్టుబడింది. ఈ తరుణంలో ప్రభుత్వం దిగొచ్చింది.
ఎప్పటి లాగానే గణేష్ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ గణేశుడిని కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం ట్యాంక్ బండ్ పై ఎనిమిది క్రేన్లు, ట్యాంక్ బండ్ చుట్టూ 22 క్రేన్లను సిద్ధంగా ఉంచారు. ఇవికాక ఎన్టీఆర్ మార్గం మీద మరో తొమ్మిది క్రేన్లు, పీపుల్స్ ప్లాజాలో మూడు క్రేన్లు, రెండు బేబీ పాండ్ల వద్ద రెండు క్రేన్లు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం దిగిరావడంతో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఉత్తర కాశీకి చెందిన ఆదిశంకర బ్రహ్మ విద్యాపీఠం ప్రజ్ఞానంద సరస్వతి స్వామిజీ వారికి నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు.
ఏయే రూట్ల నుంచి విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు తీసుకురావాలనే దానిపై ఈ రూట్ మ్యాప్ ద్వారా స్పష్టతను ఇచ్చారు. ఇక హుస్సేన్సాగర్లో నిమజ్జనం ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు.పరిశీలించారు. ఎన్టీఆర్ మార్గ్లో ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 1 నుంచి బయలుదేరి ట్యాంక్బండ్ వరకు వెళ్లి పరిశీలించారు.
Source: Nijamtoday





