News

రాష్ట్రంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

430views

అమ‌రావ‌తి: కొవిడ్ కారణంగా రెండేళ్ళు కళ తప్పిన వినాయకచవితి వేడుకలు ఈసారి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కళాకారులు తమ సృజనాత్మకతను జోడించి విభిన్న రూపాల్లో గణేశుడిని తయారుచేశారు. కాలుష్యాన్ని దూరం చేసేలా పర్యావరణహిత వినాయక ప్రతిమలను ఏర్పాటుచేశారు. తిరుపతి తుమ్మలగుంటలో ఏడు వేల పైనాపిల్స్‌తో ఏకదంతుని ప్రతిమను కొలువుదీర్చారు. దీనికి అదనంగా మండపానికి ఇరువైపులా మంగళ వాయిద్యాలు వాయిస్తున్నట్టు ఉన్న బాల వినాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. కడప ఊరగాయలవీధిలో ప్రొద్దుతిరుగుడు విత్తనాలతో రూపొందించిన 12 అడుగుల గణేశ్ విగ్రహం ఆకర్షిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి