
431views
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న హరియాణా, పంజాబ్ల్లో రెండు ముఖ్యమైన ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితం చేస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు హరియాణాలోని ఫరీదాబాద్లో అమృత హాస్పిటల్ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆ తరువాత, ఆయన మొహాలీకి బయలుదేరి వెళ్ళి, 2.15 గంటలకు సాహిబ్ జాదా అజీత్ సింహ్ నగర్ జిల్లా (మొహాలీ) లోని న్యూ చండీగఢ్ పరిధిలో గల ముల్లాన్పూర్లో ‘హోమీ భాభా కేన్సర్ హాస్పిటల్ ఎండ్ రిసర్చ్ సెంటర్’ ను దేశ ప్రజలకు అంకితం చేస్తారు.
Source: Nijamtoday





