
ఆగ్రా: ఆగ్రాలోని ఇమ్లీ వలీ మసీదు వెలుపల రోడ్డుపై నమాజ్ చేయడంపై ఈ నెల మూడోతేదీన హిందూ మహాసభ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మసీదు ఆగ్రాలోని గుర్ కీ మండిలో ఉంది. నమాజ్ను రోడ్డుపై కాకుండా మసీదు లోపలే నిర్వహించాలని హిందువులు కోరారు. అయినా కూడా వారు వినిపించుకోలేదు.
హిందూ మహాసభ జిల్లా అధినేత రోనక్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ, నమాజ్ సమయంలో ముస్లింలు దుకాణాలను నడపనివ్వరని అన్నారు. వారు రహదారిపై అడ్డుగా ఉంటారని, అంబులెన్స్ల వంటి అత్యవసర వాహనాలు కూడా తరచుగా ఇరుక్కుపోతున్నాయని ఆయన తెలిపారు. “దుకాణదారులు ముందుగానే దుకాణాలను మూసివేసి తమ వాహనాలను రహదారి నుండి దూరంగా తరలించాలి. ఎవరైనా వాహనాన్ని సకాలంలో తొలగించకపోతే, పోలీసులకు ఫోన్ చేసి దుకాణదారుపై చలాన్ జారీ చేయిస్తారు” అని అన్నారు.
ట్రాఫిక్లో కదలిక ఉండేలా రహదారికి ఒక వైపు మాత్రమే నమాజ్ చేసుకోనివ్వాలని, మిగిలిన రోడ్డు మీద వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉండేలా చూడాలని పోలీసులు ముస్లిం సమాజాన్ని కోరారు. రోడ్డుకు ఒకవైపు మాత్రమే నమాజ్ చేయనివ్వడానికి మిగిలిన వారు అంగీకరించారు. కాగా, నిబంధనలను పాటించడంలో విఫలమైతే, హిందూ సంఘాలు నిరసనను పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని.. దుకాణదారులకు, ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించడాన్ని అసలు ఒప్పుకోమని హిందూ సంఘాలు తేల్చి చెప్పాయి. రోడ్డుపై నమాజ్ చేసినప్పుడు, హనుమాన్ చాలీసా పఠించేందుకు ఎందుకు అనుమతించరని హిందూ మహాసభ అధికార ప్రతినిధి సంజయ్ జాట్ ప్రశ్నించారు.
Source: NationalistHub





