
-
సీపీఎం-డీవైఎఫ్ఐ పనే…
తిరువనంతపురం: కేరళలో మరో ఘోరం జరిగిపోయింది. సీపీఎం-డీవైఎఫ్ఐ కార్యకర్తలు 28 ఏళ్ళ యువమోర్చా(బీజేవైఎం) నేత అరుణ్కుమార్ను పొట్టన పెట్టుకున్నారు. శివరాత్రి నాడు సీపీఎం కార్యకర్తల కత్తిపోట్లకు గురైన థరూర్ పంచాయతీ భారతీయ జనతా యువమోర్చా కార్యదర్శి అరుణ్కుమార్ శుక్రవారం మృతి చెందారు. ఏడుగురు నిందితుల్లో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేయగా, నిందితులందరూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్) (సిపిఎం) కార్యకర్తలే.
కుంభ నిమజ్జనం కోసం పజంబలకోడ్ మరియమ్మన్ ఆలయం నుండి ఊరేగింపు గాయత్రి నదికి వెళ్ళినప్పుడు సమస్య ప్రారంభమైంది. పోలీసులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు. అయితే, కమ్యూనిస్ట్ క్యాడర్ దూరంగా వెళ్ళి ఆయుధాలతో మళ్ళీ గుమిగూడింది. వారు భక్తులను కొట్టారు. దీంతో అరుణ్ జోక్యం చేసుకోవడంతో వారు అతని ఎడమ ఛాతీపై కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన అరుణ్ను అలత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, నెన్మారాలోని మరో ఆస్పత్రికి తరలించారు. అతనికి ఆపరేషన్ చేసినా పరిస్థితి మారలేదు. చివరికి ఆ వీర యువకుడు తుది శ్వాస విడిచాడు.
నిందితులు
సీపీఎం కార్యకర్త వడకెపావాడి మణికందన్(56), ఆయన కుమారుడు కృష్ణదాస్(23)లను పోలీసులు ముందుగా అరెస్టు చేశారు. రమేష్(23), నితిన్(22), జయేష్(21), సంతోష్(21)లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొదటి నిందితుడైన వడకెపావాడి డివైఎఫ్ఐ (సిపిఎం యువజన విభాగం) కార్యదర్శి మిథున్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
అరుణ్కు టార్గెట్ చేశారు
అరుణ్కు ఈ ప్రాంతంలో చాలా ప్రభావం ఉంది మరియు అతని నాయకత్వంలో చాలా మంది స్థానిక యువకులు ఆర్ఎస్ఎస్లో చేరారు. గత పంచాయతీ ఎన్నికల సమయంలో థరూర్లో సీపీఎం చేతిలో ఒక్క ఓటు తేడాతో బీజేపీ ఓడిపోయింది. అప్పటి నుండి బిజెపి కార్యకర్తలు, వారి కుటుంబాలు నిరంతరం బెదిరింపులు, అణచివేతలను ఎదుర్కొంటున్నాయి. కాగా, అరుణ్ దారుణ హత్య వెనుక సీపీఎం, డీవైఎఫ్ఐ కార్యకర్తల హస్తం ఉందని బీజేపీ వాదిస్తోంది. సీపీఎం మాజీ మంత్రి ఏకే బాలన్ సూచన మేరకే అరుణ్ను హత్య చేశారని బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ప్రఫుల్కృష్ణ ఆరోపించారు.
Source: HINDU POST





