News

ఆధునిక శ్రేణి బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

403views

బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. ఆధునిక శ్రేణి బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగాన్ని నౌకాదళం విజయవంతంగా ప్రయోగించింది. దీర్ఘశ్రేణిలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి పూర్తి ఖచ్చితత్వంతో ఛేదించినట్లు నౌకాదళం ప్రకటించింది. త్రివిధ దళాల్లోని వివిధ మాధ్యమాల యుద్ధ సన్నద్ధతను ఈ ప్రయోగం చాటిచెప్పిందని తెలిపింది.

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ ఇప్పటికే త్రివిధ దళాల్లో చేరినా దీనికి సంబంధించి మరింత ఆధునిక శ్రేణి క్షిపణి ప్రయోగాలను..రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్ధ (డీఆర్డీఓ) నిర్వహిస్తోంది. రష్యాతో కలిసి భారత్ ఈ క్షిపణులను రూపొందిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.