
534views
న్యూఢిల్లీ: అత్యంత ముఖ్యమైన రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడం మినహా భారత దేశానికి మరొక దారి లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సెమీకండక్లర్లు వంటి కీలకాంశాల్లో స్వయంసమృద్ధి కోసం కృషి చేయడం వల్ల ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం మరింత బలోపేతమవుతుందని ఆయన చెప్పారు.
బడ్జెట్ ప్రతిపాదనలపై పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యాభివృద్ధి శాఖ ‘ప్రపంచం కోసం మేక్ ఇన్ ఇండియా’ శీర్షికతో నిర్వహించిన వెబినార్లో మోదీ మాట్లాడుతూ, సెమీకండక్లర్ల విషయానికి వచ్చేసరికి స్వయం సమృద్ధి సాధించడం మినహా భారత దేశానికి మరొక దారి లేదని పేర్కొన్నారు. ఈ రంగం ‘మేక్ ఇన్ ఇండియా’కు నూతన అవకాశాలను తీసుకొచ్చిందని ఆయన చెప్పారు.
Source: Nijamtoday





