
571views
-
నిప్పులు చెరిగిన చంద్రగిరి వాసులు
చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఏటా సంక్రాంతి చివరి రోజున జరిగే పశువుల పండగకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము జరుపుకునే పండగ జల్లికట్టు కాదని, పశువులను హింసించకుండా చేసుకునే పండగ అని స్పష్టం చేశారు. తరతరాలుగా తాము ఈ పండగ జరుపుకొంటున్నామని, అలాంటి పండగకు అడ్డు చెప్పడమేంటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు మాత్రం పశువుల పండగ నిర్వహించకూడదని హెచ్చరిస్తున్నారు.





