News

బ్రిటన్‌లో ఒక్కరోజే లక్ష కొవిడ్ కేసులు

596views
  • అయినా క్రిస్మస్ చేసుకోవచ్చు అంటున్న అక్క‌డి ప్రధాని

లండ‌న్: బ్రిటన్​లో బుధవారం ఒక్కరోజే లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల్లో దేశంలో 6, 43, 219 కేసులు వెలుగుచూసినట్టు యూకే హెల్త్​ ఏజెన్సీ వెల్లడించింది. ప్రపంచదేశాల్లోనూ ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోంది. యూకేలో 1,06,122 కేసులు నమోదవగా… 140 మంది మృతిచెందారు. అయితే.. కొవిడ్ సమయంలో ఆరోగ్య సిబ్బంది పనితీరును ప్రశంసిస్తూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిస్టమస్​ నేపథ్యంలో సిబ్బంది బూస్టర్​ డోసు పంపిణీపై దృష్టి పెట్టిందని అన్నారు. అయితే.. కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ క్రిస్టమస్​ సంబరాలు జరుపుకోవొచ్చని జాన్సన్​ చెప్పడం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి