News

కేంద్రం నిర్ణయంతో తగ్గిన వంట నూనెల ధరలు

502views

వంట నూనెలపై 2.5% ఉన్న ప్రాథమిక సుంకాలను సున్నాకి తగ్గించడంవల్ల వాటి ధరలు తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర ఆహారం, పౌరసరఫరాలు, వినియోగవ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ముడి పామాయిల్ ‌పై అగ్రిసెస్ ‌ను 20% నుంచి 7.5%కి తేవడం, ముడి సోయాబిన్‌, సన్ ‌ఫ్లవర్‌ ఆయిల్ ‌పై దీన్ని 5% కి తగ్గించడంవల్ల వినియోగదారుడికి అందే ధరల్లో ఆ ప్రభావం కనిపిస్తున్నట్లు తెలిపింది. ప్రధాన ఉత్పత్తిదారులైన ఆదానీ విల్మర్‌, రుచి ఇండస్ట్రీస్‌ టోకు ధరలను ఒక్కో లీటర్‌పై రూ.4 నుంచి రూ.7దాకా తగ్గించినట్లు పేర్కొంది. దీనివల్ల వినియోగదారులకు ఉపశమనం లభిస్తున్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.