
417views
-
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: లద్దాఖ్ సరిహద్దు ప్రతిష్టంభన అంశంపై శాంతియుత పరిష్కారం కోసం చైనాతో చర్చలు కొనసాగుతాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. సరిహద్దు రక్షణకు భారత సైన్యం దృఢనిశ్చయంతో ఉందన్నారు. దేశ భద్రతా సవాళ్లపై మిలిటరీ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో రాజ్నాథ్ మాట్లాడారు. సైన్యానికి కావల్సిన ఆయుధ సామగ్రిని, మౌలిక సదుపాయాలను సమకూర్చడం, జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టడం తదితర విషయాలు చర్చకు వచ్చాయి.





