News

ప్రతాప్ గడ్ జిల్లాలోని పురాతన సూర్య ఆలయాన్ని పునరుద్ధరించనున్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం

924views

త్తర ప్రదేశ్‌లోని అధికారులు ఇటీవల రాష్ట్రంలోని ప్రతాప్ గడ్ జిల్లాలోని ఒక పురాతన సూర్యాలయాన్ని గుర్తించారు. దీనిని ఇప్పుడు మతపరమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళిక. ఈ ప్రణాళికపై రాష్ట్ర పర్యాటక శాఖ, ఉత్తర ప్రదేశ్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్త బృందం కృషి చేస్తోంది.

గ్రామస్తుల చొరవతో, భయ హరన్ నాథ్ ధామ్ క్షేత్రియా వికాస్ సంస్థాన్ వారు ఆలయ శిధిలాల ఉనికి గురించి అధికారులకు సమాచారం ఇచ్చి, అవశేషాలను పరిరక్షించే చొరవను ప్రారంభించారు.

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) బృందం 2011 లో సూర్య దేవాలయ శిధిలాలను సందర్శించింది. గౌరా గ్రామ పంచాయతీకి పురాతన వస్తువులు మరియు కళల చట్టం – 1972 ప్రకారం నియమాలను పాటించాలని ఆదేశించింది.

ఇప్పుడు… ఒక దశాబ్దం తరువాత, ఉత్తర ప్రదేశ్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు పర్యాటక విభాగాలు ఈ స్థలాన్ని పునరుద్ధరించడానికి చొరవ తీసుకున్నాయి.

“ప్రతాప్ గడ్ జిల్లాలోని ఈ మారుమూల గ్రామంలో సూర్య దేవాలయం ఉనికి గురించి చాలా మందికి తెలియదు. చారిత్రక నిర్మాణం యొక్క శిధిలాల గురించి ప్రజలకు తెలియజేయడానికి మా సంస్థాన్ ముందుకు వచ్చింది. ఆలయం మరియు చుట్టుపక్కల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, నిర్వహించడానికి వారి సహాయం కోరింది. ” అని భయ హరన్ నాథ్ ధామ్ క్షేత్రియ వికాస్ సంస్థాన్ ప్రతినిధి తెలిపారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.