News

కశ్మీరీ నేతలతో ప్రధాని మోడీ సమావేశంపై పాక్ అక్కసు

409views

భారత అంతర్గత వ్యవహారాల్లో పాక్ మళ్లీ తలదూర్చింది. జమ్ముకశ్మీర్​ నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన సమావేశంపై తన అక్కసు వెళ్ళబోసింది. ఈ భేటీ ‘ఓ పెద్ద డ్రామా’ అని, పబ్లిసిటీ సమావేశమని వ్యాఖ్యానించింది.

ప్రధాని నిర్వహించిన సమావేశానికి ఆల్​ పార్టీస్​ హురియత్​ కాన్ఫరెన్స్(ఏపీహెచ్​సీ)ను ఆహ్వానించలేదని పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషీ పేర్కొన్నారు. కశ్మీర్​లో జనాభాపరంగా మార్పులు తీసుకువచ్చేందుకు భారత్​ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. భారత్​తో బ్యాక్​ డోర్​ దౌత్యవిధానాన్ని తాము అనుసరించటం లేదని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.