
721views
మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హరిభూషణ్ అనారోగ్యంతో చనిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హరిభూషణ్ ఉత్తర తెలంగాణ కమిటీ కార్యదర్శిగా పని చేసినట్లు సమాచారం. హరిభూషణ్ స్వస్థలం తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మరగూడ. ఎజెన్సీలో మరికొంత మంది మావోయిస్టులు కూడా కరోనా బారినపడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వినోద్, రాజేశ్, ఇడుమ తదితరులు కూడా కరోనా బారినపడినట్లు పోలీసుల భావిస్తున్నారు. అయితే హరిభూషణ్ మృతిపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.





