
423views
భారతీయ రైల్వేలో కమ్యూనికేషన్లు, సిగ్నలింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 700 MHz బ్యాండ్లో 5 MHz స్పెక్ట్రమ్ను కేటాయించింది. ఈ ప్రాజెక్ట్కు రూ.25వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ప్రస్తుతం రైల్వే శాఖ కమ్యూనికేషన్లు, సిగ్నలింగ్ కోసం ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్పై ఆధారపడుతోంది. స్పెక్ట్రమ్ కేటాయింపు వల్ల కమ్యూనికేషన్ల వ్యవస్థ బలోపేతం అవుతుందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.





