News

రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థ బలోపేతానికి కేంద్రం పచ్చజెండా

423views

భారతీయ రైల్వేలో కమ్యూనికేషన్లు, సిగ్నలింగ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 700 MHz బ్యాండ్‌లో 5 MHz స్పెక్ట్రమ్‌ను కేటాయించింది. ఈ ప్రాజెక్ట్‌కు రూ.25వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ పూర్తవుతుంది. ప్రస్తుతం రైల్వే శాఖ కమ్యూనికేషన్లు, సిగ్నలింగ్‌ కోసం ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌పై ఆధారపడుతోంది. స్పెక్ట్రమ్‌ కేటాయింపు వల్ల కమ్యూనికేషన్ల వ్యవస్థ బలోపేతం అవుతుందని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.