News

జమాత్, హెఫాజత్ ల పై కఠిన చర్యలు తప్పవు : బంగ్లా ప్రధాని

560views

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా అలజడులు సృష్టించి, దేశంలోని అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన అతివాద ఇస్లామిక్ సంస్థలు జమాతే ఇస్లామి మరియు హెఫాజితే ఇస్లాం సంస్థలపై కఠిన చర్యలు తప్పవని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు.

ఈ దాడులలో 12 మందికి పైగా మృతి చెందారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. అనేక హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి.

గత నెల 26, 27 తేదీలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ ఆహ్వానం మేరకు ఆ దేశ విముక్తి ఉద్యమ ఉత్సవాల విశిష్ట అతిథిగా ఆ దేశంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జమాతే ఇస్లామి మరియు హెఫాజితే ఇస్లాం సంస్థల పిలుపు మేరకు అక్కడ పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి.

ఈ అల్లర్లకు ప్రధాన కారకుడైన హెఫాజితే నాయకుడు మమునుల్ గురించి బంగ్లా ప్రధాని మాట్లాడుతూ… “వాహనాలకు నిప్పంటించి అవి తగలబడుతుంటే మమునల్ మాత్రం తన రెండవ భార్యతో రిసార్ట్ లో కులుకుతున్నాడు. వీటన్నిటికీ అతనికి డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి?” అని ఆమె ప్రశ్నించారు.

ఈ అతివాదుల వివరాలను సేకరించవలసిందిగా ఆమె ఆ దేశ ఇంటెలిజెన్స్ ను ఆదేశించారు. ప్రతిపక్ష BNP మాత్రం జమాత్, హెఫాజత్ల నిరసన ప్రదర్శనలకు మద్దతునిచ్చింది. బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఈ విషయంపై ఆదివారం పార్లమెంటులో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.