
840views
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బాధితులకు భారతసంతతి వైద్యులు ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తున్నారు. సౌత్వింట్సార్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డా.ఉమామధుసూదన్ సేవలకు కృతజ్ఞతగా అక్కడి ప్రజలు 200లకు పైగా కార్లలో వచ్చి ఆమెకు సెల్యూట్ చేశారు. కర్నాటకలోని మైసూర్కు చెందిన ఉమా మైసూర్ వైద్య కళాశాలలోనే ఎంబీబీఎస్ పూర్తి చేశారు. కొవిడ్-19పై వీరోచితంగా పోరాడుతున్న వైద్యురాలి సేవలకు అమెరికన్ పౌరులు ఆమె ఇంటి ముందుకు చేరుకొని వాహనాల్లో నుంచే కృతజ్ఞతలు తెలిపారు.





