News

యువతిపై పాస్టర్ లైంగికదాడి

1kviews

తనో పాస్టర్, దైవదూతగా మంచి చెప్పాలి. ప్రార్థన చేసేందుకు వచ్చేవారిపై కరుణ చూపాలి. కానీ మహిళ ఫోటోలు తీసి మార్ఫింగ్ చేసి బెదిరించాడు. సమయం చూసి తన బుద్దిని బయట పెట్టాడు. అతని ఆగడాలు భరించలేని మహిళ చివరికి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో గల మచిలీపట్నంలో యువతి కుటుంబం ఉంటోంది. అక్కడ పాస్టర్ జోయల్ రెచల్ దైవ ప్రార్థనలు చేస్తూ మంచి కన్నా చెడు పనులు చేస్తున్నాడు. 25 ఏళ్ల యువతి ఇంటి వద్దకు వచ్చేవాడు. ప్రార్థనల పేరుతో దగ్గరయ్యాడు. ఆమె ఫోన్ నుంచి కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. వాటిని మార్చి అసభ్యకరంగా చిత్రీకరించి ఆమెకు చూపించాడు.

దీంతో యువతి విస్తుపోయింది. ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు గురిచేశాడు. అలా యువతిని బెదిరిస్తే వచ్చాడు. ఆమె ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకొని మంగళవారం వచ్చాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై లైంగికదాడికి తెగబడ్డాడు. ఫాస్టర్ అరాచకాన్ని ఎలాగైనా బయటకు తీసుకురావాలని యువతి భావించింది. మంగళవారం మచిలీపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఫాస్టర్‌లో మరో కోణం వెలుగులోకి వచ్చింది.

యువతి ఫిర్యాదు మేరకు ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల కోసం యువతిని మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫాస్టర్ రేచల్ పరారీలో ఉన్నాడని అతడిని పట్టుకొంటామని పోలీసులు చెప్తున్నారు. గతేడాది డిసంబర్‌లో తెలంగాణ రాష్ట్రంలో మహిళపై లైంగికదాడి జరిగిన సంగతి తెలిసిందే. యువతిని దిశ అని పిలువడంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చింది. లైంగికదాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.