
548views
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెలలో జరగాల్సిన ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ'(ఏబీపీఎస్) వార్షిక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆరెస్సెస్ ప్రకటించింది. ముందుగా నిర్ణయించినట్లు బెంగళూరులో ఈ నెల 15 నుంచి 17 మధ్య ఈ సమావేశాలు జరగాల్సి ఉంది. ఆరెస్సెస్లో అత్యున్నత నిర్ణాయక విభాగం అయిన ఏబీపీఎస్ ఏటా ఒకసారి సమావేశమవుతూ ఉంటుంది. వైరస్ దేశంలో క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాల మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషి తెలిపారు. వైరస్ ముప్పును సమర్థంగా ఎదుర్కొనేలా స్థానిక యంత్రాంగంతో కలిసి ప్రజల్లో అవగాహన కల్పించాలని అయన స్వయంసేవకులను కోరారు.





