News

ఆలయ హుండీ నుండి నగదు దొంగిలించిన షాబిక్ అరెస్టు

138views

దక్షిణ కన్నడ జిల్లా మంగళ కెంజారు గ్రామంలో ఉన్న శ్రీ రామాంజనేయ ఆలయంలో ఇటీవల ఒక దొంగతనం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు షబిక్ అహ్మద్ షేక్‌ను అరెస్టు చేశారు. షబిక్ ఆలయ గేటును పగలగొట్టి లోపలికి ప్రవేశించి, మూడు హుండీల నుండి సుమారు 25,000 రూపాయలను దొంగిలించాడు. ఈ ఘటనపై బాజ్‌పే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

షబిక్ స్వస్థలం తమిళనాడులోని దిండిగల్ జిల్లా. విచారణలో షబిక్ తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు దొంగిలించబడిన హుండిను స్వాధీనం చేసుకున్నారు. ఉడుపి జిల్లాలో కూడా షబిక్‌పై ఒక దొంగతనం కేసు నమోదైంది. విచారణలో తేలిందేమిటంటే, షబిక్ తమిళనాడు నుండి ఈ వచ్చి, దొంగతనాలు చేసి, తిరిగి తమిళనాడుకు పారిపోయేవాడు.