News

శబరిమలలో 50% మంది తెలుగు భక్తులే

132views

శబరిమలలో అంతకంతకు పెరుగుతున్న భక్తుల జనసందోహం. కేవలం ఒక్కరోజే ఆంధ్ర, కర్ణాటక, రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా శబరిమలకు తరలివచ్చారు. స్థానిక సంస్థల ఓటింగ్‌ రోజు(పంచాయతీ ఎన్నికలు) అయినప్పటికీ..సన్నిధానం, పంపా, శరణవాళి భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరిచినప్పుడూ..గంటలో ఏకంగా 13 వేల మందికి పైగా భక్తులు పంపా కొండ ఎక్కారు.

సాయంత్రం 6 గంటలకు దర్శనం కొచ్చే వారి సంఖ్య 75,463 కు చేరుకుంది. 18వ మెట్టు ఎక్కేందుకు సరంకూతి, మరంకూట్ట మధ్య భారీ క్యూ ఉంది. గత కొన్ని రోజులతో పోలిస్తే..నిన్న ఒక్కరోజే రద్దీ అధికం. రుమెలిలోని పెట్టతుల్లి దర్శనం కోసం పంపకు వచ్చిన వారిలో 50 శాతం మంది ఆంధ్ర, తెలంగాణకు చెందినవారే ఉన్నారు. అలాగే నిన్న దర్శనానికి వచ్చిన మలయాళీలలో చాలామంది మలబార్‌ ప్రాంతానికి చెందినవారే కావడం గమనార్హం.