
561views
చర్చి నిర్మాణం కోసం జరుపుతున్న త్రవ్వకాలలో ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. దీంతో భక్తులు భారీ సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకొని పూజలు చేశారు. తెలంగాణా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ్ పల్లి గ్రామంలో కొందరు చర్చి నిర్మించేందుకు స్థలాన్ని సేకరించి దానిలో నిర్మాణాన్ని జరిపేందుకు త్రవ్వకాలు ప్రారంభించారు. ఆ త్రవ్వకాలలో భారీ సైజులో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం బయట పడింది. ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.