
పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు తమ మద్దతును తెలియజేస్తూ అఖిల భారతీయ అధివక్త పరిషత్ (ఎబిఎపి) నేతృత్వంలోని సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం బుధవారం ఉన్నత న్యాయస్థానం యొక్క పచ్చిక బయళ్లలో వందేమాతరం పాడిందని టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) నివేదించింది.
ఈ బృందంలో అశ్విని ఉపాధ్యాయ, ప్రశాంత్ పటేల్, విష్ణు జైన్, హరిశంకర్ జైన్ వంటి న్యాయవాదులు ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి తమ మద్దతును తెలపడానికే తాము వందేమాతరం ఆలపించామని న్యాయవాదులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 1.45 గంటలకు వారు వందేమాతరాన్ని ఆలపించారు. వారు రాజ్యాంగం యొక్క ముందుమాటను హిందీలో చదివి భారత్ మాతా కి జై అని నినాదాలు చేశారు.
మోడీ వ్యతిరేక న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, సల్మాన్ ఖుర్షీద్, కామిని జైస్వాల్ వంటివారు మంగళవారం సుప్రీంకోర్టు పచ్చిక బయళ్లలో రాజ్యాంగం యొక్క ముందుమాట చదివారు. దానికి ప్రతిగా అఖిల భారతీయ అధివక్త పరిషత్ (ABAP) న్యాయవాదులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గమనార్హం.
Source: Organiser
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





