
నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ఆదాయం పెంచేలా దేవాదాయ శాఖ బృహత్తర ప్రణాళికను రూపొందిస్తోంది. ఆలయం సమీప ప్రాంతాలు సముద్రం, గోదావరి, ఫిషింగ్ హార్బర్, వివిధ రకాల జలపుష్పాలు, పచ్చటి చెట్లతో కళకళలాడుతూ ఆధ్యాత్మికతతోపాటు పర్యాటకానికి అనుకూలంగా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారి దర్శనం తర్వాత ఆయా ప్రాంతాలను సందర్శించేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు.
ఆదాయం పెంచేందుకు..
స్వామివారికి సుమారు 900 ఎకరాలు ఉండగా వాటిపై లీజులు, హుండీ ఆదాయం, టిక్కెట్ల ద్వారా రూ.6 కోట్లు వస్తోంది. ఇవి సీజీఎఫ్, జీతాలు, ధూపదీప నైవేద్యాలకు సరిపోతున్నట్లు ఏసీ చెబుతున్నారు. ఆలయానికి విరాళాలు ఇచ్చే దాతలకు గుర్తింపు కార్డులిచ్చి వారు దర్శనానికి వచ్చినప్పుడు ఉచితంగా పూజలు చేయించి, వసతి కల్పిస్తారు. నిత్య ధూపదీప నైవేద్యాలు, పూజాది కార్యక్రమాలకు రుసుము పెంచడం, శని, ఆదివారాలతోపాటు పర్వదినాల్లో ఉచితంగా బస్సులు నడిపించడం వల్ల ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.
కార్యాచరణ ఇలా..





