
ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! 3 వ భాగం ఇక్కడ చదవండి
ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! 2 వ భాగం ఇక్కడ చదవండి
ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! – 1 వ భాగం ఇక్కడ చదవండి
కుట్రలు.. కుతంత్రాలు..!
భారత్ను ముక్కలు ముక్కలుగా చేయడానికి ప్రయత్నిస్తున్న అరాచక శక్తులు కీళడి మీద కన్నేశాయి. పాలక డీఎంకే, చర్చి ఫాదర్లు, మోసపూరిత ఎన్జీవోలు అనే అపవిత్రమైన త్రయం తమిళ సంస్కృతిని క్రైస్తవీకరణ చేయడానికి ప్రయత్ని స్తోంది. కీళడిలో చేపట్టిన తవ్వకాలతో వెలుగులో వచ్చిన పురాతన వస్తువులను వేరువేరుగా చూస్తోంది. హిందూ నాగరికతను ప్రతిబింబిస్తూ ద్రవిడవాదంతో ఏ మాత్రం సంబంధం లేని వస్తువులను నామ రూపాల్లేకుండా చేస్తోంది. తద్వారా తమిళుల సొంత నాగరికతను భూస్థాపితం చేస్తోంది. క్రైస్తవంతో రంగరించిన సరికొత్త అక్రమ నాగరికతకు పురుడు పోసే పనిలో ఈ అపవిత్రమైన త్రయం ఉంది. ఈ మాట ఎవరో అనామకుడు అన్నారంటే పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ రెండు పోస్ట్` డాక్టోరల్ పరిశోధనలను తన ఖాతాలో వేసుకొన్న ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ బీఎస్ హరిశంకర్ అన్నారంటే మాత్రం దాని గురించి మన బుర్రలకు పనిపెట్టాల్సిందే. అంతటి శాస్త్రవేత్త కేవలం మాటలతో సరిపుచ్చక ‘‘కీళడి తవ్వకాల్లో అంతర్జా తీయ జోక్యాలు’’ (గ్లోబల్ ఇంటర్వెన్షన్స్ ఇన్ కీళడి ఎక్స్కావషియన్స్) పేరిట ఒక శాస్త్రీయమైన అధ్యయన పత్రాన్ని సమర్పించారు. ఆ పత్రం కేసరి వీక్లీలో ప్రచురితమైంది. అందులో ప్రస్తావించిన అంశాలు తవ్వకాల వెనుక వివాదాల తేనెతుట్టెను కదిపాయి. తమిళనాడు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి.
తవ్వకాల వెనుక చరిత్రను తారుమారు చేసే స్వార్ధపూరితమైన దురుద్దేశాలు దాగి ఉన్నాయి. ఇందులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె, తూత్తుకుడి ఎంపీ కనిమొళి హస్తం ఉంది. స్వయంప్రకటిత పురావస్తు శాస్త్రవేత్తలు కీళడిలో తవ్వకాలకు సంబంధించి అన్ని నిబంధన లను ఉల్లంఘించారు. దేశవ్యాప్తంగా పురావస్తు ప్రాంతాల్లో తవ్వకాలు బహిరంగంగా జరుగుతుండగా కీళడిలో మాత్రం అత్యంత గోప్యంగా మూడో కంటికి తెలియకుండా జరిపారు. తవ్వకాల గోప్యత ఎంత దాకా వెళ్లిందంటే బైటపడిన వస్తువులను చూడ్డానికి సాక్షాత్తూ భారత పురావస్తు సర్వేక్షణ `ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా` ఏఎస్ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ టీఎస్ సత్యమూర్తి వంటి పురావస్తుశాస్త్రవేత్తలను అనుమతించ లేదు. వారిని తవ్వకాలు జరిగే చోటుకు రానివ్వలేదు. తవ్వకాల వెనుక ఉన్న వ్యక్తులు కీళడిలో వెలుగులోకి వచ్చిన నాగరికతకు భారతీయ నాగరికతకు ఏ మాత్రం సంబంధం లేదని నిరూపించడానికి కంకణం కట్టుకున్నారు. వేర్పాటువాదాన్ని పెంచి పోషించడానికి, ద్రవిడ జాతిని స్థాపించడానికి అనుకూలమైన ఫలితాలను తవ్వకాల నుంచి రాబట్టడానికి అత్యంత దారుణమైన పనికి పాల్పడ్డారు. అందులో భాగంగా దేశంలో విస్తృతమైన సౌకర్యాలు ఉన్నప్పటికీ తవ్వకాల్లో బైటపడిన వస్తువులు ఏ కాలానికి చెందినవో నిర్ధారించడానికి అమెరికాలో ప్రయోగశాలకు వాటిని పంపించారు. తమకు అనుకూలమైన ఫలితాన్ని రాబట్టుకున్నారని ఆ పత్రం వెల్లడిరచింది.
తవ్వకాల నుంచి చర్చి చరిత్ర సృష్టి
డాక్టర్ హరిశంకర్ ‘‘కీళడి: ఓ చర్చి చరిత్రను సృష్టించే తవ్వకం’’ (కీళడి: డిగ్గింగ్ టు క్రియేట్ ఏ చర్చ్ హిస్టరీ) పేరిట మరో వ్యాసాన్ని రాశారు. కీళడిలో తవ్వకాలకు నేతృత్వం వహించిన కె. అమర్ నాథ్ రామకృష్ణకు, నేర చరిత్ర కలిగిన రెవరెండ్ జస్పేర్ రాజ్కు మధ్య సంబంధాలను చూసీ చూడనట్టుగా వదిలేయకూడదని హెచ్చరించారు. రాజ్కు, కనిమొళికి మద్దతు ఇవ్వడంలో అమర్నాథ్ రామకృష్ణ ప్రదర్శించిన అత్యుత్సాహం అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఆ క్రమంలో ఆయన కీళడిలో అపోస్తల్ థామస్ చరిత్రకు చెందిన ఆనవాళ్లు ఉన్నాయని నిరూపించేందుకు వామపక్షాలకు, చర్చి చరిత్రకారులకు అనుకూలంగా తవ్వకాలపై ఒక నివేదికను రూపొందించారనడంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని హరిశంకర్ రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా కేరళలో పట్టణంలో చేపట్టిన తవ్వకాలకు(ఇక్కడ రోమన్ సామ్రాజ్యపు అవశేషాలు బైటపడ్డాయిట!), కీళడిలో తవ్వకాలకు ముడిపెట్టడం ద్వారా హిందూ నాగరికతలో వేళ్లూనుకున్న తమిళ నాగరికత రూపురేఖలు మార్చడానికి పెద్ద కుట్ర జరిగింది. ఆ క్రమంలో అప్పటి తమిళనాడు రాష్ట్ర పురావస్తు విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఆర్.శివనాథన్ దీనికి అవసరమైన వేదికను సిద్ధం చేశారు. పట్టణంలో తవ్వకాలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త పీజే చెరియన్ను చెన్నయ్కు పిలిపించారు. ఆయనతో ఒక బ్రహ్మాండమైన ప్రసంగాన్ని ఇప్పించారు. కీళడిలో బైటపడినవాటికి, పట్టణంలో బైటపడినవాటికి చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయని చెరియన్తో చెప్పించారు.
ఎన్జీవోల ఇష్టారాజ్యం!
తమిళనాడులో ఎన్జీవోలకు తవ్వకాల్లో బైటపడిన పురాతన వస్తువులపై పూర్తి పెత్తనం ఉంటుంది. పురావస్తు శాస్త్రవేత్త పీజే చెరియన్ నిర్వహణలోని పామా అనే ఎన్జీవోకు వాటిపై అంతే పట్టు ఉంటుంది. లోర్డు ఆనందం, విన్సెంట్ చిన్నదురై లాంటి కాథోలిక్ ఫాదర్లతో నిండి ఉన్న రెవరెండ్ జస్పేర్ రాజ్కు చెందిన తమిళ్ మయం అనే ఎన్జీవోదీ ఇదే దారి. సాధారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో జరిపే పురావస్తు తవ్వకాల్లో బైటపడిన వస్తువులను అధ్యయనం చేయడం కోసమని కర్నాటకలోని బెంగళూరులో భారత పురావస్తు సర్వేక్షణ `ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ` ఏఎస్ఐకి చెందిన కార్యాలయానికి పంపిస్తుంటారు. అయితే అలా పంపిస్తే హిందూ నాగరికతతో ముడిపడిన తమిళ నాగరికత వెలుగులోకి వస్తుందనే అనుమానంతో ఈ దుష్ట దుర్మార్గపు ఎన్జీవోలు కోర్టు మెట్లు ఎక్కాయి.
కేళడిలో బైటపడిన వస్తువులను కర్ణాటకకు పంపించవద్దని కోరుతూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. వీటికి ఇంత బరితెగింపునకు కారణం విదేశాల నుంచి అప్పనంగా వచ్చి పడే నిధులు. దేశం మొత్తమ్మీద చూస్తే తమిళనాడులో ఉన్న ఎన్జీవోలకు పెద్ద మొత్తంలో విదేశాల నుంచి నిధులు అందుతున్నాయి. కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం 2013`14 ఆర్థిక సంవత్సరానికి తమిళనాడులో ఎన్జీవోలు విదేశాల నుంచి దాదాపు రూ.547 కోట్లను అందుకున్నాయి.





