
76views
ఉత్తరప్రదేశ్ లోని సంభల్ జిల్లా
నరౌలీ పట్టణ గోడలపై ‘గాజా/పాలస్తీనాకు విముక్తి కల్పించండి’ అనే నినాదాలతో వెలసిన పోస్టర్లపై చర్యలకు ఉపక్రమించి ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ పోస్టర్లలో ఇజ్రాయెల్ వస్తువులను బహిష్కరించాలని ముస్లింలను కోరుతూ పిలుపు కూడా ఇచ్చారన్నారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. బాధ్యులపై అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ రంగంలోకి దిగాల్సి వస్తుందని బజరంగ్ దళ్ కన్వీనర్ నితిన్ శర్మ మీడియా ఎదుట వ్యాఖ్యానించారు.