
216views
తమిళనాడులోని కులశేఖరపట్టినం నుంచి మరో రెండేళ్లలో రాకెట్ను అంతరిక్షంలోకి ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన సొంత జిల్లా కన్నియాకుమరికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడి నుంచి వచ్చాం, ఏ పాఠశాలలో చేరామన్నది ముఖ్యం కాదని, ఎలా చదివామన్నదే ప్రధానమని తెలిపారు. తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్టినంలో ప్రయోగ కేంద్రం పనులు జరుగుతున్నాయని మరో రెండేళ్లలో అక్కడి నుంచి రాకెట్లను ప్రయోగిస్తామని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెరిగిందని, ఇస్రోతో పాటు ఆ తరహా సంస్థల్లో ఉన్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.





