Programms

మహాకుంభమేళాకు యూపీ సీఎం.. మంత్రులతో కలిసి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు

32views

త్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ లో మహా కుంభమేళా కొనసాగుతోంది. 45 రోజులపాటు సాగే ఈ మహాకుంభ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సైతం మహాకుంభమేళాకు వెళ్లారు.

డిప్యూటీ సీఎంలు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, బ్రజేశ్‌ పాఠక్‌ సహా కేబినెట్‌ మంత్రులతో కలిసి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. సంక్రాంతి రోజున ప్రారంభమైన (జనవరి 13) మహా కుంభమేళా ఫిబ్రవ‌రి 26వ తేదీన మ‌హాశివ‌రాత్రితో ముగుస్తుంది. 45 రోజులపాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ సర్కార్‌ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కోట్లాది మందికి త‌గిన రీతిలో ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం.