హైందవ శంఖారావం సభలో శివానంద సరస్వతీ మాతాజీ ప్రసంగం:
వందే భారత మాతరం, వందే గురు పరంపరాం. మన ధర్మం సనాతనం, పురాతనం, ప్రాచీనం, వైదిక ప్రమాణం కలిగినది.
మన ధర్మం పుచ్చుకునేది కాదు, మనం పుట్టిందే ఈ ధర్మంలో. మన ధర్మం పుచ్చిపోయేది కాదు, మరచిపోయేది కాదు. అది మన జీవన విధానం.
ఈ జీవన విధానాన్ని చూసి సహించలేక, విదేశాల నుంచి ఆశ్రయం కోరి వచ్చిన అన్యమతాల వారు మన మీదనే దాడి చేస్తున్నారు.
ఎవరి కర్మ వారు అనుభవిస్తారు, మనమెందుకు పూసుకోవడం అనుకోవడం జడత్వం, అవివేకపు ఆలోచనతో ఇన్నాళ్ళూ సహించుకుంటూ వచ్చాం. ఇకపై సహించేది లేదు.
మతమౌఢ్యం ఏమిటి, ధర్మ దార్ఢ్యత ఏమిటో మనం తెలుసుకోవాలి. మన ధర్మానికి దార్ఢ్యం ఉంది కాబట్టే కొద్దిరోజుల్లో ప్రయాగలో మొదలయ్యే కుంభమేళా ఇక్కడే సాక్షాత్కారమయింది.
కాషాయం అగ్నివర్ణం, అది దేన్నయినా దగ్ధం చేస్తుంది. సహనం సహనం సహనం అని నొక్కిపెట్టడంతో హిందూజాతి కాస్త ఉపేక్ష వహించింది. ఇప్పుడు ఉపేక్షించడానికి సమయం లేదు.
అన్యమతస్తులు మనను… మతం తీసుకుంటే బతుకుతావు లేదా చస్తావు అంటారు. మీరు కాఫిర్లు, సైతాన్లు అంటూ చంపేస్తారు.
బాలవీరులు జొరావర్ సింగ్, ఫతేసింగ్…. మతం మారకపోతే చంపేస్తామన్నా మతం మారలేదు, ప్రాణాలు వదిలేసారు.
ఆశ్రయం కోరి వచ్చిన మతస్తులు ఇప్పుడు ఆ భూములు మావి, ఈ భూములు మావి అని ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంటే ఇంకా సహనంగా ఉండకూడదు.
అందుకే విశ్వహిందూ పరిషత్ ఈ శంఖారావం చేపట్టింది. ఇక్కడ హైందవ జనసాగరాన్ని చేరదీసింది.
ఈ సాగరం ఎదురుగా వచ్చే కెరటాలను ఉపేక్షించకూడదు.స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ పేరుతో ఇన్నాళ్ళూ ఇతర మతాలను గౌరవించాము, ఆదరించాము.
రామాయణాన్ని చూస్తే రాముడు ఎందుకు ఊరుకోలేదు… రాక్షస సంహారం చేసాడు, రావణుణ్ణి వధించాడు. ఆ రామనామంతో హనుమంతుడు రాక్షసులను నలిపి చంపేసాడు.
సర్వ ఆదరణ సరే… దేన్ని ఆదరించకూడదో కూడా నేర్చుకోవాలి. రాముడు విభీషణుణ్ణి ఆదరించాడు, రావణుణ్ణి వధించాడు. అదే మనకు ఆదర్శం.
మన ధర్మంలోని విస్తృత విశాల భావన కొంతవరకే మంచిది. శరీరంలో ఒక భాగం కుళ్ళిపోయి, దాన్ని తీసేయాలని వైద్యులు చెబితే దాన్ని తీసేస్తాం కదా. అలాగే అన్యమతస్తులు చేస్తున్న దాడులను ఉపేక్షించకూడదు.
శతకంఠ రావణుడిని సీతాదేవి హనుమంతుడి మీద కూర్చుని వధించిందని పరాశర సంహిత చెబుతోంది. అలాంటి శక్తిని మన స్త్రీ సమాజం ఆవహించుకోవాలి. మన దేవాలయాలను మనం రక్షించుకోవాలి.
కృష్ణుడు దగ్గరుండి అర్జునుడితో యుద్ధం చేయించాడు. విహెచ్పి సంకల్పం సిద్ధించాలని కనకదుర్గమ్మను ప్రార్థిస్తున్నాను. జై శ్రీరాం.
"మానవ సేవే మాధవ సేవ" అనే మూల మంత్రంతో విపత్తుల సమయంలో సమాజానికి తోడ్పడే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), అస్సాంలో సంభవించిన భయంకరమైన వరదల వేళ...
బంగ్లాదేశ్లో మరోసారి రాజకీయ కల్లోలం మొదలైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్, మాజీ ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కథనాలు అక్కడి...
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హెచ్డీపీపీ సహకారంతో నిర్వహిస్తున్న‘మహాలక్ష్మీ దీపపూజ’ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, దీనిని త్వరలో గ్రామస్థాయికి విస్తరించనున్నట్లు టీటీడీ...
ప్రభుత్వ విద్యాలయాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటి వనాలు పెంచడం ద్వారా కర్బన ఉద్గారాల్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేసేందుకు వీబీ...
రాంచీ: సమాజంలో ఐక్యత, సామాజిక సామరస్యం మరియు బలమైన జాతీయ చైతన్యాన్ని పెంపొందించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన లక్ష్యమని సీనియర్ ప్రచారక్, అఖిల్ భారతీయ...