NewsProgramms

హైందవ శంఖారావం సభలో శైవపీఠం శివస్వామీజీ ప్రసంగం

479views

హైందవ శంఖారావం సభలో శైవపీఠం శివస్వామీజీ ప్రసంగం:

  • సనాతన ధర్మంలో గోవుకు విశిష్టస్థానం ఉంది. గావో విశ్వస్య మాతరః. విశ్వానికే తల్లి గోవు.
  • వేదాలలో 1331సార్లు గో ప్రస్తావన వస్తుంది. క్షీరసాగర మథనంలో గోవు ఆవిర్భవించి పంచగోవులుగా మారి ఆ కామధేనువే భూమిమీద గోమాతగా జన్మనిస్తుంది.
  • హిందూధర్మంలో గోవుకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. శ్రీకాకుళం నుంచి చెన్నై వరకూ ఎన్నో గోవులు వధించబడుతున్నాయి.
  • వాటిని రక్షించడానికి గో సంరక్షకులు ప్రయత్నించినప్పుడు ఎన్నో నాటకాలు మొదలవుతాయి. ఫిర్యాదు చేసిన వారి పైనే కేసులు పెడుతున్నారు.
  • ఈ హైందవ శంఖారావం వేదిక మీదనుంచి ఒక సంకల్పం చేసుకుందాం… గోవును జాతీయప్రాణిగా ప్రకటించాలని సంకల్పం చేద్దాం. అఖండభారత నిర్మాణమే ధ్యేయంగా ప్రయత్నం చేద్దాం.