NewsProgramms

హైందవ శంఖారావం సభలో గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహ భాషణం

396views

హైందవ శంఖారావం సభలో
దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహ భాషణం:

  • శంఖం అంటేనే జయం. మనం ఆశిస్తున్న అపేక్షిస్తున్న విషయానికి జయం కలగాలని దత్తుడిని ప్రార్థిస్తున్నాను.
  • హిందూ సంస్కృతికి 5120 సంవత్సరాలు. హిందూరాష్ట్రం దేవలోకం అని విదేశీయులే చెబుతుంటారు.
  • ఎన్నో పుణ్యనదులు, పర్వతాలు. దేవుడే అవతారాలు దాల్చడానికి ఈ భూమిని ఎంచుకున్నాడు. ఇక్కడ పుట్టడం మన అదృష్టం.
  • ఈ దేశంలో ప్రతీ ఆలయం గొప్ప దాతలు కట్టించారు. అలాంటి ఆలయాలను మనం రక్షించుకోవాలి.
  • మన హ్యాపీ న్యూ ఇయర్ ఉగాది. మనం కేకులు కోయకూడదు, దీపాలు ఆర్పకూడదు.
  • హైందవ ధర్మం ఇచ్చిన ఈ పిలుపు దిగంతాలకు చేరాలి, మన ప్రార్థన పరమాత్ముడికి చేరాలి.
    ఒక్క నినాదం శక్తి ఆ ప్రాంతంలో దశాబ్దాల పాటు నిలిచి ఉంటుంది.
  • మన ధర్మాన్ని మనం పాలించుకోవాలి. దత్తాత్రేయుడు మీ ఆకాంక్షలను నెరవేర్చు గాక.