
అఖిల భారతీయ సామాజిక సమరసత కన్వీనర్ శ్యాంప్రసాద్ రచించిన ‘‘బుద్ధ, స్వామి వివేకానంద’’, అలాగే గౌరంగ విశ్వాస్ రచించిన బెంగాల్ ‘‘సాహితీ వికాసంలో లోక్ కళ భాగస్వామ్యం’’ అన్న పుస్తకాల ఆవిష్కరణ కోల్ కత్తాలో జరిగింది. ప్రాథమిక సైన్స్ సూత్రాల్లోనూ కొన్ని మార్పులు చూస్తున్నామని, అలాగే మత విషయాల్లోనూ, తత్వశాస్త్రాల్లోనూ భిన్నమైన ఆలోచనా విధానాలుండటం సహజమన్నారు. అలాంటి సమయంలో ఈ విభిన్న ఆలోచనల విషయంలో ఎందుకు గొడవలకు దిగాలని ప్రశ్నించారు. నదులన్నీ చివరికి సముద్రంలోనే కలుస్తాయని పరమ హంస చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిని పాటించాలని పిలుపునిచ్చారు. భారత్ లో వుండే వివిధ మతానుయాయులు ధర్మ రక్షణకు, దేశ ఉద్ధరణ, ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేయాలని శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు.
మరోవైపు గౌరంగ విశ్వాస్ పుస్తక సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అందులోని విషయాలను వివరించారు. బంగ్లా సాహిత్యాన్ని సుసంపన్నం చేయడంలో లోక్ కాల సహకారం అవసరమన్నారు. ఈ సందర్భంగా ఆరెస్సెస్ ప్రాంత ప్రచారక్ ప్రశాంత్ భుట్ కూడా మాట్లాడారు.
కలకత్తా అనేక మంది సాధకులకు పుట్టిల్లు. ముఖ్యంగా బౌద్ధులతో పాటు రామకృష్ణ పరమహసం, స్వామి వివేకానంద కూడా ఇక్కడే జన్మించారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంలో నలంద విశ్వవిద్యాలయం అత్యంత ప్రసిద్ధి చెందింది. కానీ… ఛాందసులు, భారత వ్యతిరేకులు బిహార్ లో, కోల్ కత్తాలో నలందా విశ్వవిద్యాలయంపై దాడి చేసి, ధ్వంసం చేశారు. దీంతో బెంగాల్ లో వేలాది మంది బౌద్ధ సన్యాసులు చనిపోయారు.
మరోవైపు బెంగాల్ పరమ హంస సాధనా భూమి. అలాగే స్వామి వివేకానంద ఆయన స్ఫూర్తితో విదేశాలకు వెళ్లి, హైందవ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే నరేంద్రుడు, సిద్ధార్థుడు ఇద్దరూ సమాజ శ్రేయస్సు కోసం, ఉద్ధరణ కోసం తమ ఇంటిని విడిచారు, కుటుంబ బంధాలను కూడా విడిచిపెట్టి, లోక కల్యాణం కోసం జీవించారు. కాషాయ వస్త్రాలు ధరించి, ధర్మ ప్రచారం చేస్తూ.. ప్రపంచ శాంతి కోసం విశేషంగా కృషి చేశారు. వీరిద్దరూ తమ శరీరాలను విడిచిపెట్టేసి, ఇన్ని సంవత్సరాలు గడిచినా… వారి ముద్రలు మాత్రం స్పష్టంగా ప్రపంచంలో కనిపిస్తూనే వున్నాయి.