News

భాయ్ దూజ్ పండుగ

380views

(నవంబర్ 3- భాయ్ దూజ్ పండుగ)

క్యాలెండర్ ఆధారంగా ఈ సంవత్సరం భాయ్ దూజ్ పండుగను నవంబర్ 3, 2024 ఆదివారం జరుపుకుంటారు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం భాయ్ దూజ్‌ని యమ ద్వితీయ అని కూడా అంటారు. ఈ రోజు యమరాజ్ తన సోదరి యమునాజీని కలవడానికి వచ్చారని చెబుతుంటారు. అప్పటి నుంచి ఈ పండుగను భాయ్ దూజ్‌గా జరుపుకుంటారు.

ఈ శుభ సమయంలో తిలకం పెట్టడం సోదరులకు అదృష్టాన్ని తెస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. భాయ్ దూజ్‌లో తిలకం వేయడానికి అనువైన సమయం నవంబర్ 3న ఆదివారం. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:51 నుంచి 5:43 వరకు, మధ్యాహ్నం ముహూర్తం: మధ్యాహ్నం 1:10 నుంచి 3:22 వరకు, విజయ ముహూర్తం: మధ్యాహ్నం 1:54 నుంచి 1:54 వరకు, తిలకం ప్రధాన శుభ సమయం: మధ్యాహ్నం 1:16 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఇందులో సోదరీమణులు తమ సోదరులకు తిలకాన్ని వేయవచ్చు.